భూదాన భూమిలో పేదల గుడిసెలు తొలగింపు

by Sridhar Babu |
భూదాన భూమిలో పేదల గుడిసెలు తొలగింపు
X

దిశ, ఖమ్మం టౌన్ : నిరుపేదలు నిరుపయోగం గా ఉన్న భూమి లో వేసుకున్న గుడిసెలను శనివారం అధికారులు కూల్చారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ మౌజాలోని సర్వే నెంబర్ 147,148, 149 లో గల 62 ఎకరాల 7 కుంటల భూదాన భూమిలో ఎటువంటి నివాసాలు లేని పేదలు 2014 సంవత్సరంలో భూదాన యజ్ఞ బోర్డు హైదరాబాద్ కార్యాలయంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోగా 1895 కుటుంబాలకు స్థలాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీనికి వినోబా నవోదయ కాలనీ అని నామకరణం చేసి నివాసం ఉంటున్నారు. హైకోర్టు ఇక్కడ మంచినీరు, కరెంటు, రోడ్లు మొదలగు సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి నిర్మాణం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోరాదని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోకుండా ఇళ్లు కూల్చివేశారు. దాంతో ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story