- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డీటీసీపీ అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపేశాం: వైరా సబ్ రిజిస్ట్రార్ రామ్ కుమార్

దిశ, వైరా: వైరా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత డీటీసీపీ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ లను పూర్తిగా నిలిపేశామని వైరా సబ్ రిజిస్ట్రార్ రామ్ కుమార్ తెలిపారు. వైరా మున్సిపాలిటీలో డీటీసీపీ అనుమతి లేకుండా అక్రమంగా వేసిన వెంచర్లపై ఇటీవల దిశ దినపత్రికలో 'అంతా అక్రమమే', 'చర్యలకు వెనకడుగు' అనే వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. అందుకు స్పందించిన వైరా సబ్ రిజిస్ట్రార్ డీటీసీపీ అనుమతి లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని దిశతో స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే ఇటీవల దిశలో వచ్చిన వార్తా కథనాలకు స్పందించిన జిల్లా ఉన్నతా అధికారులు టీపీఓ భాస్కర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో గత డిసెంబర్ 31వ తేదీన టీపీఓ భాస్కర్ ను వైరా మున్సిపాలిటీలో డీటీసీపీ అనుమతి లేని వెంచర్ల వివరాలతో తమకు నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులు ఆదేశించారు. వైరాలో వారానికి రెండు రోజులు మాత్రమే డిప్యూటేషన్ పై పనిచేసే టీపీఓకు అక్రమ వెంచర్ల పై పూర్తి అవగాహన లేకపోవడంతో అక్రమ వెంచర్ల వివరాలు సేకరించేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా పూర్తిస్థాయిలో అక్రమ వెంచర్ల వివరాలను ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు అందించ లేకపోతున్నారని మున్సిపాలిటీ పాలకవర్గంలోనే చర్చ జరుగుతోంది.
ఈ వెంచర్ల వివరాలను సేకరించేందుకు టీపీఓ నేరుగా రంగంలోకి దిగకుండా ఆ పనులను ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి అప్పగించడం వివాదాస్పదమైంది. జిల్లా ఉన్నతాధికారులు ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా స్థానిక అధికారులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన టీపీఓ రమణి, అప్పటి కమిషనర్ ఎన్ వెంకటపతి రాజు పలుసార్లు అక్రమ వెంచర్లో రాళ్లు తొలగించారు. ఇవన్నీ తెలిసిన ప్రస్తుత టీపీఓ భాస్కర్ కనీస ప్రాథమిక చర్యలు తీసుకోకుండా నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను స్థానిక అధికారులు అమలు చేస్తారో.. ఇదంతా మాకు మామూలే అని వదిలేస్తారో వేచి చూడాల్సిందే.