- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేసీఆర్ నాయకత్వంలో పార్టీ గెలుపును ఎవ్వరు ఆపలేరు : రేగా*

దిశ, దుమ్ముగూడెం : మండలంలోని పలుకార్యక్రమాల్లో మంగళవారం పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రాగ కాంతారావు పాల్గొన్నారు. మండల కేంద్రం లక్ష్మీనగరంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి పాటుపడాలని, వారికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ పై ఎవరెంత దుష్ప్రచారం చేసినా, కుట్రలు కుతంత్రాలు పన్నినా రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని ఆయన అన్నారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తల కృషి ఉండాలని, ముఖ్యమంత్రి చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని, త్వరలో మండలంలో జరగబోయే ఆత్మీయ సమ్మేళనంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులు తమ పంచాయతీలలో అభివృద్ధి పనులకు నిధులను కేటాయించాలని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 10 లక్షల నిధులను వెంటనే ఇప్పించాలని కోరారు. రేగా స్పందించి వీటితో పాటు సీడీపీ నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పర్ణశాల ఎంపీటీసీ తెల్లం భీమరాజు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, మండల అధ్యక్షుడు అన్నే సత్యనారాయణమూర్తి, కార్యదర్శి కనితి రాముడు, అధికార ప్రతినిధి జానీ పాషా, ఉపాధ్యాక్షడు తునికి కామేష్, ఎంపీటీసీ సీత, సర్పంచులు , ఉప సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.