క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రేగా కాంతారావు

by Kalyani |
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రేగా కాంతారావు
X

దిశ, మణుగూరు: మండల పరిధి సంతోష్ నగర్ ఏరియాలో బేరాకా చర్చ్ లో ఆదివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజు అని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని మతాలను గౌరవిస్తూ ప్రభుత్వపరంగా పండుగలను నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.



Next Story

Most Viewed