- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తెలంగాణపై కక్ష సాధింపు చర్యలు.. కేంద్రంపై రేగా కాంతారావు ధ్వజం..

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతందని ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. సీఎం కేసీఆర్ సారాధ్యంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తుంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేఖ విధానాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించామంటూ దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ కార్మికులకు, కర్షకుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రవేశపెడుతుందని తెలిపారు. రైతు కల్లాలు చేయడం పాపమా.. రూ 150 కోట్లు వసూలు చేసి కేంద్రానికి అప్పజెప్పాలా.. 8 నెలల నుంచి రూ 1100 కోట్లు ఆపారని నిలదీశారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతు వేదికలు కట్టారని రూ.150 కోట్లు రైతుల వద్ద వసూలు చేసి కేంద్రానికి ఇస్తానే 1100 కోట్లు బకాయిలు విడుదల చేస్తామనడం సరికాదని పేర్కొన్నారు. కేంద్రం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ పథకాలను అమలు చేసే దమ్ము మోదీ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వంపై రోజు రోజుకు ప్రజల్లో నమ్మకం సన్నగిళ్లుతుందని, బీఆర్ఎస్కు దేశంలో పెరుగుతున్న ఆధరణను చూసి వాళ్లు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ నియంతృత్వ ధోరణిని అవలంభిస్తున్న మోదీ ప్రభుత్వం పతనం తప్పదని దుయ్యబట్టారు. పార్లమెంట్ సాక్షిగా ప్రశంసలు కురిపిస్తున్న మోడీ సర్కార్ నిధుల కేటాయింపుల్లో మొండిచేయి చూపిస్తుందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం రైతుల కోసం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత విద్యుత్, నాయనమైన విత్తనాలు, విత్తనాలపై పీడీ యాక్టివ్ వేదికలు కార్యక్రమాల ద్వారా రైతులను కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. కేంద్ర మాత్రం వ్యవసాయం దండగానే రీతిలో కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తున్నదని ఆరోపించారు. బంగారు తెలంగాణను బాధల రాష్ట్రంగా మార్చాలని చేస్తే సహించేది లేదని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిధులు వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ ఇచ్చిన లేఖను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దశలవారిగా దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర్లు, ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, అశ్వరావుపేట నియోజవర్గ ఓమ్మెల్యే మేచ్చ నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.