సోషల్ మీడియా వేదికగా బీజేపీ ప్రభుత్వంపై 'రేగా' ఫైర్..

by Kalyani |
సోషల్ మీడియా వేదికగా బీజేపీ ప్రభుత్వంపై రేగా ఫైర్..
X

దిశ, మణుగూరు: బీజేపీ ప్రభుత్వంపై పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఫైర్ అయ్యారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా మరోసారి ఘాటుగా స్పందించారు. బీజేపీ అధికార మదంతో ఏమి చేసినా చెల్లుతుందని అనుకుంటే పొరపాటే అని, బీజేపీ కుట్రలను ఛేదిస్తామని, మీకు అధికార బలముంటే.. మాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు మమ్మల్ని ఏమీ చేయలేరని ఫేస్ బుక్ ద్వారా ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, దమ్ముంటే కేంద్రప్రభుత్వాన్ని రద్దుచేస్తే, ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. బీజేపీ ప్రభుత్వంపై రేగా కాంతారావు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించడం పట్ల జిల్లా రాజకీయాల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది.



Next Story

Most Viewed