- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఊపిరి పీల్చుకున్న అధికారులు.. నిలకడగా గోదావరి

దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి 54.60 అడుగుల వద్ద ఉదయం 9 గంటల నుంచి నిలకడగా ఉంది. గత రెండు రోజులుగా మెల్లమెల్లగా పెరిగిన గోదావరి వరద అధికార యంత్రాంగాన్ని, గోదావరి పరివాహక గ్రామాల ప్రజలను హడలెత్తించింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అంగుళం కూడా పెరగకుండా రెండు గంటలపాటు నిలకడగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎగువ ప్రాంతంలోని పేరూరు వద్ద గోదావరి తగ్గుతుండగా, ప్రస్తుతం వర్షాలు, స్థానిక వరదలు లేకపోవడంతో భద్రాచలం వద్ద కూడా వరద ఈ మధ్యాహ్నం నుంచి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే వరద 50 అడుగులకు తగ్గితే భద్రాచలం నుంచి చర్ల వైపుకి రాకపోకలు పునరుద్ధరించబడతాయి. ప్రస్తుతం రవాణ స్తంభణతో దుమ్మగూడెం, చర్ల మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.