- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చీమలపాడు ఘటనకు బాధ్యత వహిస్తూ ఎంపీ, ఎమ్మెల్యే రాజీనామా చేయాలి : రాందాస్ నాయక్ డిమాండ్

దిశ, వైరా : కారేపల్లి మండలంలోని చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు పేల్చిన బాణాసంచా వల్ల జరిగిన అగ్ని ప్రమాదానికి నైతికంగా బాధ్యత వహిస్తూ ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని టీపీసీసీ సభ్యులు, వైరా నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మాలోత్ రాందాస్ నాయక్ డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదానికి గురై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బుధవారం మధ్యాహ్నం రాందాస్ నాయక్ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వాకం వల్లే అమాయకులైన ప్రజలు దుర్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా గాయపడిన ప్రతి ఒక్కరికి 50 లక్షలు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం అర్థంలేని కార్యక్రమని మండిపడ్డారు. ఈ ఆత్మీయ సమ్మేళనం ఇద్దరు చావుకి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ఎంపీ నామ నాగేశ్వరావు, ఎమ్మెల్యే రాముల నాయక్ పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను రాజకీయం చేయవద్దని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ రాజకీయం చేసి వాళ్లని చంపారని ఆరోపించారు. క్షతగాత్రులను ప్రవేట్ ఆసుపత్రులకు తరలించి మరింత మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ పూర్తి ఘటనకు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనలో పోలీస్ గన్మెన్ కూడా క్షతగాత్రుడు కావడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ నాయకులు సమాజానికి ముక్కు నేల రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి గ్యాస్ సిలిండర్ పేలటానికి సంబంధం లేదని నామ నాగేశ్వరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సిగ్గు, శరం ఉన్న ఏ నాయకుడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ బాధితుల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.