కన్నుల పండువగా రాములోరి కల్యాణం

by Sridhar Babu |
కన్నుల పండువగా రాములోరి కల్యాణం
X

దిశ, దుమ్ముగూడెం : మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో భక్తుల మధ్య రాములవారు సీతమ్మను పరిణయం ఆడారు. దాంతో రామనామ స్మరణలతో దేవాలయ పరిసరాలు మార్మోగాయి. ఉదయం 9 గంటల నుంచి పర్ణశాలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల సౌకర్యార్థం అధికారులు చలువపందిళ్లను, తాగునీటిని, మజ్జిగ, వైద్య శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు.

తలంబ్రాలు, లడ్డూల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద భక్తులు కొనుగోలు చేశారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. స్థానిక సీఐ దోమల రమేష్ బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. తహసీల్దార్ చంద్రశేఖర్, మండల అభివృద్ధి అధికారి చంద్రమౌళి, ఎంపీ ఓ ముత్యాలరావు, స్థానిక సర్పంచ్​ తెల్లం వరలక్ష్మి వసతులను పర్యవేక్షించారు.



Next Story