మతసామరస్యానికి ప్రతీక రంజాన్

by Sridhar Babu |
మతసామరస్యానికి ప్రతీక రంజాన్
X

దిశ, సత్తుపల్లి : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఎన్టీఆర్ నగర్ కాలనీలోని మసీద్ లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కళ్ల పాత్ర ఉన్నదని తెలిపారు. కేసీఆర్​ ఆధ్వర్యంలో దేశంలోనే తెలంగాణ ఉన్నతమైన రాష్ట్రంగా అభివృద్ధిలో దూసుకొని పోతున్నదని పేర్కొన్నారు.

అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్, వనమా వాసు, వార్డు కౌన్సిలర్ చాంద్ బాషా, అద్దంకి అనిల్, తడికమల్ల ప్రకాష్ రావు, నడ్డి ఆనందరావు, గుండ్ర రఘు, మసీదు ముస్లిం పెద్దలు పలువురు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed