- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రేగా షాకింగ్ పోస్ట్.. ఎవ్వరికీ ఒక్క రూపాయి ఇవ్వద్దు..

దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని దళితులు దళితబందు పథకం రావాడం కోసం ఏ నాయకుడికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని ప్రభుత్వ విప్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ చేశారు. నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు దళితులకు దళితబందు ఇప్పిస్తామని,ఎమ్మెల్యే పేరు చెప్పి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆయన సోషల్ మీడియా స్పష్టం చేశారు.అంతేకాక నియోజకవర్గంలో దళితుల దగ్గర దళిత బంధు పేరుతో డబ్బులు వసూళ్ళు చేస్తే నా దృష్టికి తీసుకురావాలని ఆయన దళితులను కోరారు. దళితుల దగ్గర దళిత బంధు పేరుతో డబ్బులు వసూళ్లు చేస్తే ఎంతటి వారైనా సరే సహించబోమని ఎమ్మెల్యే రేగా సోషల్ మీడియాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అర్హులైన ప్రతి యొక్క దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.