- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖదీర్ ఖాన్ ది పోలీసుల హత్యే : ప్రజాసంఘాల ఐక్య వేదిక

దిశ, ఖమ్మం : ఖదీర్ ఖాన్ మరణం పోలీసుల హత్యే అని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆరోపించింది. ఖమ్మం నగరంలోని ఐక్యవేదిక కార్యాలయంలో ఆదివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత నెల 29వ తారీఖున మెదక్ లో ఓ మహిళ నుంచి బంగారపు గొలుసు గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడనే నెపంతో పాతబస్తీకి చెందిన ఖదీర్ ఖాన్ ని పోలీసులు తీసుకువచ్చి ఐదు రోజులు పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీని ప్రయోగించడంతో ఈ నెల 17న మరణించాడని తెలిపారు. ఖదీర్ ఖాన్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన్నారు.
గతంలో ఖమ్మంకి చెందిన మరియమ్మ అనే మహిళను ఇదే విధంగా కొట్టడం వలన మరణించిందని, అప్పుడు ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేశారో అదే విధంగా ఖదీర్ ఖాన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, తన ముగ్గురు పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా విద్యను అందించాలని, 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మరణానికి కారకులైన పోలీస్ సిబ్బందిని తక్షణమే విచారణ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు, కన్వీనర్ గుంతేటి వీరభద్రం, కోకన్వీనర్ బానోతు భద్రు నాయక్, అబ్దుల్ రెహమాన్, పెరుగు వెంకటరమణ యాదవ్, మాల మహానాడు దాసరి శ్రీను, ఐక్యవేదిక నాయకులు రవిచంద్ర చౌహన్, జంగిపల్లి రవి, నకిరికంటి సురేష్, ఉపేంద్ర నాయక్, రమ్య పాల్గొన్నారు.