- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అటవీ సంరక్షణ నియమాలను వ్యతిరేకిస్తూ 14న గుండాలలో బహిరంగ సభ

దిశ, ఇల్లందు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన అటవీ సంరక్షణ నియమాలు 2022 ను వ్యతిరేకిస్తూ ఈనెల 14వ తేదీ గుండాల మండలం కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు తెలిపారు. శుక్రవారం ఆయన దిశతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ తొలగింపుతో పాటు ఏజెన్సీలో జీవిస్తున్న అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపాదన దోచుకోవడం కోసం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం చట్టాలను తీసుకు వచ్చి ప్రజలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే బహిరంగ సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.