మండుటెండలో ఒంటి కాలిపై నిలబడి నిరసన

by Sumithra |
మండుటెండలో ఒంటి కాలిపై నిలబడి నిరసన
X

దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండల కేంద్రంలో విఓఏ లకు కనీస వేతనం చెల్లించాలని ఎనిమిదో రోజు సోమవారం ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ విఓఏలు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బూర్గంపాడు మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలనే ప్రధాన డిమాండుతో మండుటెండలో సమ్మెను కొనసాగిస్తున్నారు. విఓఏల సమ్మెకు బీజేపీ నాయకులు వెంకట్, పలువురు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరాస్వామి, రామచందర్, రాహేశ్వరి, పద్మావతి, వసంత, ధనలక్ష్మి, భారతి, సౌజన్య, పాపారావు, సుమలత, పోషమ్మ, రమాదేవిసుభద్ర పలువురు పాల్గొన్నారు.



Next Story

Most Viewed