సర్పంచ్ నుండి తమ భూమిని రక్షించండి : ఉపేందర్ తల్లిదండ్రుల ఆవేదన

by Sridhar Babu |
సర్పంచ్ నుండి తమ భూమిని రక్షించండి : ఉపేందర్ తల్లిదండ్రుల ఆవేదన
X

దిశ, ఖమ్మం టౌన్ : తమ భూమిని స్థానిక సర్పంచ్ నుండి రక్షించి తమకు అప్పగించాలని కూసుమంచి మండలం నాయకన్ గూడెం కు చెందిన బాధితులు వాపోయారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు పాలె బోయిన ఉపేందర్ తల్లిదండ్రులు మాట్లాడుతూ 2012లో తాము పొలం కొనుగోలు చేయగా అందులో ఎకరం 7 కుంటలు జాతీయ రహదారి నిర్మా ణంలో కోల్పోయారని , మిగిలిన ఎకరం 26 కుంటలు రోడ్డుకు రెండు వైపులా ఉండగా 26 కుంటల భూమిలో ఆంజనేయస్వామి గుడి, ముస్లింలకు దర్గా ను నిర్మించారని పేర్కొన్నారు.

ఇక మిగిలిన మూడు కుంటల భూమిలో ఇల్లు నిర్మించుకునేందుకు షెడ్డు ను వేస్తున్న సమయంలో స్థానిక సర్పంచ్ కాసాని సైదులు అడ్డుకుని కంఠమేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని వేధిస్తుండడంతో తమ కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో అధికారుల అనుమతితోనే ఆలయాలు నిర్మిస్తుండగా కావాలనే తమ భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. సర్పంచ్ నుండి తమ భూమిని రక్షించి తగిన న్యాయం చేయాలని కోరారు.



Next Story

Most Viewed