- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సమాధి నుంచి బయటకు తీసి పోస్ట్ మార్టం

దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామానికి చెందిన సారిన వెంకటేశ్వరరావు(25) అనే యువకుడు ప్రేమ వ్యవహారంలో మనస్థాపం చెంది శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గమనించిన బంధువులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం యువకుడు మృతి చెందాడు. అదే రోజు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి వారి వ్యవసాయ భూమిలో సమాధి చేశారు. అయితే ఆత్మహత్యపై ఫిర్యాదు చేయకుండానే అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. తర్వాత విషయం తెలుసుకున్న స్థానిక పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎస్సై బి.రాజేష్ కుమార్ మంగళవారం రెవెన్యూ సిబ్బంది, సర్పంచ్ నారం రాజశేఖర్ సమక్షంలో మల్లాయిగూడెంలోని సమాధి నుంచి యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రభుత్వ వైద్యుడు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం యువకుడి మృతదేహాన్ని తిరిగి భూస్థాపితం చేశారు. అవగాహన లేకపోవడం వల్లే పోలీసులకు సమాచారం అందించకుండా సమాధి చేశామని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. సహజ మరణం మినహా ఎటువంటి మృతులకైనా పోలీసులకు సమాచారం అందించకుండా అంత్యక్రియలు చేయకూడదని, అలా చేస్తే నేరంగా కూడా పరిగణించే అవకాశాలు ఉన్నాయని ఎస్ఐ బి.రాజేష్ కుమార్ తెలిపారు.