- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చీమలపాడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు పొంగులేటి పరామర్శ
by Sridhar Babu |

X
దిశ, హైదరాబాద్ : కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు క్షతగాత్రులను ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పరామర్శించారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. భవిష్యత్తులోనూ తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా గాయాలబారి నుంచి కోలుకోవాలని దేవుడిని ప్రార్ధించారు. బాధితులను పరామర్శించిన వారిలో బొర్రా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Next Story