పొంగులేటిది దృతరాష్ట్ర కౌగిలి : మంత్రి అజయ్ కుమార్

by Sridhar Babu |
పొంగులేటిది దృతరాష్ట్ర కౌగిలి : మంత్రి అజయ్ కుమార్
X

దిశ, ఇల్లందు : పొంగులేటి కౌగిలి దృతరాష్ట్ర కౌగిలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఇల్లందు పట్టణంలో ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొనడానికి వచ్చారు. కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కరెంట్ ఆఫీస్ సెంటర్ నుండి జేకే గ్రౌండ్ వద్దగల సభాస్థలికి భారీ బైక్ ర్యాలీ పై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కొన్ని లక్షల మంది బీఆర్ఎస్ శ్రేణులను ఒక దగ్గరికి చేర్చి సందేశాన్ని వినిపించడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. తాను గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మీకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేస్తానని హామీ ఇచ్చానని, వాటిని నెరవేర్చానన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయం ఒక టాస్క్ లాంటిది అన్నారు. మూడున్నర సంవత్సరాల కాలంలో కాలేశ్వరం పూర్తి చేసి ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీరు అందించారన్నారు. గతంలో 19 లక్షలు ఉన్న బోరు బావులు నేడు 30 లక్షలకు చేరినా కరెంటు ఉచితంగా ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మైనారిటీ , బీసీ ఎస్సీ గురుకుల పాఠశాలతో ఒక విద్యార్థికి సంవత్సరానికి లక్ష ఇరవై వేల ఖర్చుతో ఇంగ్లీష్ మీడియాన్ని చదివిస్తున్నట్టు తెలిపారు.

బీజేపీ నేను దొడ్డి దారిన సింగరేణిని ప్రైవేట్ కు అప్పజెప్పడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం దసరా దీపావళి బోనస్ లను పెంచుతూ నేడు సింగరేణి కార్మికులకు 500 కోట్ల బోనస్ ఇచ్చే స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో 786 కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కోరం కనకయ్యను మళ్లీ వెంటనే జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించి జెడ్పీ చైర్మన్ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. చేతనైతే జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కూర్చోవాలన్నారు.

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి : ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీసుకోవాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో 91,475 మంది, 748 కోట్ల రూపాయలతో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పొందుతున్నారన్నారు. క్యాబినెట్ హోదా కలిగిన జెడ్పీ చైర్మన్ పదవి ఇచ్చి అందలం ఎక్కించిన కేసీఆర్ ను విమర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు.

ఈ కార్యక్రమం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండి గల రాజేందర్, జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ, పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, టీబీజీకే స్ ఉపాధ్యక్షుడు రంగనాథ్, యలమద్ది రవి, కౌన్సిలర్లు జే కే శీను, కొక్కు నాగేశ్వరరావు, కడ కంచి పద్మ, గిన్నారపు రజిత తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed