- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పొంగులేటిది ధృతరాష్ట్ర కౌగిలి

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు
దిశ, వైరా: పొంగులేటిది ధృతరాష్ట్ర కౌగిలి అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. వైరాలోని వాసవీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి నాయకుల, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "2018 సాధారణ ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డి ధృతరాష్ట్ర కౌగిలితో చాలామందికి గుండెపోటు వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టేందుకు తమ అభ్యర్థుల ఇంటి స్థలాలు ఆస్తులు రాయించుకొని సంబంధిత కాగితాలను బీరువాలో పెట్టుకున్న చరిత్ర పొంగులేటిదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తన వెంట ఉన్న ఐదుగురు అభ్యర్థులకు 2018 ఎన్నికల్లో కేసీఆర్ టికెట్లు కేటాయించారని వారిలో ఏ ఒక్కరినైనా గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఓ నాయకుడు స్వార్థ చింతన, అత్యాశతో డబ్బు రాజకీయాలతో బయలుదేరాడని పొంగులేటిని బహిరంగంగా విమర్శించారు. నారాయణపురంలోని శ్రీనివాసరెడ్డి 40 ఎకరాల మామిడి తోటకు నీరు, ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ అందుతోందని, ఆయనకు ఉన్న 108 ఎకరాలకు గాను రూ.10.80లక్షల రూపాయలు రైతుబంధు నగదు పడుతోందని వివరించారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని శ్రీనివాసరెడ్డి అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 సంవత్సరం తర్వాత శ్రీనివాసరెడ్డి ప్రమేయం లేకుండా జిల్లాలో అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిందని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎదిరించిన వారందరు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. కేవలం డబ్బుతోనే రాజకీయాలు నడువవని స్పష్టం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లావుడియా రాముల నాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, సుడా చైర్మన్ రమణ, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.