- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జూలై నెలలో మడత దంపతుల రాజకీయ ప్రవేశం
దిశ,ఇల్లందు : ఇల్లందు మున్సిపల్ మాజీ చైర్మన్ మడత రమ, మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వినూత్న రీతిలో నిర్వహించారు. తమ రాజకీయ పునప్రవేశం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వైపా...? తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ వైపా...? అంటూ రెండు కేకులను కట్ చేసి వినూత్న రీతిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇల్లందులో శుక్రవారం మడత దంపతుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారా లేదా నీళ్లు ,నిధులు, నియామకాల నినాదాలతో నూతన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ వైపు మద్దతు తెలుపుతారా అనే విషయాన్ని నియోజక వర్గంలోని మడత అనుచరులు, ప్రజలతో మాటామంతి నిర్వహించి, ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి జూలై నెలలో తమ రాజకీయ ప్రయాణాన్ని తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాంజీ, కమల్ కోరి, భరత్, కోడి రాజేందర్, మామిడి శివ, కోటగిరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.