కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి

by Sridhar Babu |
కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి
X

దిశ, దుమ్ముగూడెం/పర్ణశాల : కోడిపందాల స్థావరాలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. దుమ్ముగూడెం మండల పరిధిలోని రామారావుపేట పంచాయతీ శివారు ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కోడిపందాలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం ఉండడంతో పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారని మిగతావారు పారిపోయినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed