పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పోలీస్ బందోబస్తు

by srinivas |
పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పోలీస్ బందోబస్తు
X

దిశ కూసుమంచి: పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. నేలకొండపల్లి ఎస్ ఐ స్రవంతి రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఈ రోజు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తున్నామని ప్రకటించడంతో ఉదయం ఆరు గంటల నుండి కూసుమంచి సర్కిల్ పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే క్యాంప్ కార్యాలయం ముందు కూసుమంచి, నేలకొండపల్లి పోలీసులతో పాటు సర్కిల్ పోలీసులు కాసుకొని ఉన్నారు. ఆడుగడుగునా ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు కదలికలను గమనిస్తూ ఏ క్షణాన వారు క్యాంపు కార్యాలయానికి వచ్చిన నివారించే పద్ధతిలో పోలీసు బందోబస్తు ఉన్నది.



Next Story

Most Viewed