- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు : ఎస్సై రమేష్

దిశ, కూసుమంచి : కూసుమంచి ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను సోమవారం పోలీసులు ముమ్మరంగా చేపట్టారు. మండల కేంద్రంలోని నేలకొండపల్లి రోడ్డు మీసేవ సమీపంలో సరైన ధ్రువపత్రాలు లేని వాహన దారులకు సుమారు 11 మందికి చలానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ వాహనదారులతో మాట్లాడుతూ వాహనదారులు తప్పని సరిగా హెల్మెంట్ ధరించాలని, కారు సీటు బెల్టు దరించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువ శాతం హెల్మెట్ లేకపోవడంతోనే జరుగుతూన్నాయని, మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానుల పై కేసులునమోదు చేస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. పెండింగ్ చలానాలు ఉంటే వెంటనే చెల్లించాలని, చలాన్లు ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై రామలింగారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, రాము, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.