- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు హర్షణీయం.. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..'

దిశ, మణుగూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిరిజనుల అభివృద్ధి, మనుగడ కోసం 10శాతం రిజర్వేషన్లు పెంచడం ఎంతో హర్షణీయమని రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచడంతో సీఎం కేసీఆర్కు పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర గిరిజనులందరికీ 10శాతం రిజర్వేషన్లు పెంచడంతో గిరిజనులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని తెలిపారు. కొమురం భీమ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర పాలన సాగిస్తున్నారన్నారు. ఆదివాసీ పోడు భూముల సమస్య పరిష్కారం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
హైదరాబాద్ సిటీలో ఆదివాసి బంజారా భవనాలను నిర్మించి అడవి బిడ్డల ఆత్మగౌరవాన్ని నింపారని కొనియాడారు. రానున్న రోజుల్లో గిరిజనులకు ఉద్యోగ,ఉపాధి రంగాల్లో అనేక అవకాశాలు కల్పించబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు.