- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
న్యాయవాద సమస్యలపై ఆర్థిక మంత్రికి వినతి

దిశ, లీగల్ ఖమ్మం : గురువారం హైదరాబాద్లోని ఆర్థిక మంత్రి హరీష్ రావు నివాసంలో ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యుడు తాళ్లూరి దిలీప్ చౌదరి పలు న్యాయవాద సమస్యలపై వినతిపత్రం అందజేశారు. న్యాయవాద సమస్యల పరిష్కారం కోసం మరో 100 కోట్ల బడ్జెట్ విడుదల చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే జూనియర్ న్యాయవాదుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నూతనంగా నమోదైన న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులు జారీ చేయాలని, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆసుపత్రులు జిల్లా ప్రధాన కార్యాలయంలో తగినంతగా లేవని, ప్రతి జిల్లాలో మల్టీ /సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకొని న్యాయవాదులకు నగదు రహిత చికిత్స పొందే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
నిరుపేద జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేల స్టైఫండ్, మూడు సంవత్సరాల పాటు అందించాలని, ఆంధ్రప్రదేశ్ ,కేరళ, తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వాలు వారి బార్ కౌన్సిల్ వారు 4 లక్షలు, ప్రభుత్వం 4 లక్షలు మరణించిన న్యాయవాది నామినీకి అందజేస్తున్నాయని, అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల హౌసింగ్ సొసైటీల ద్వారా జిల్లా కేంద్రంలో అడ్వకేట్ కాలనీలను ఏర్పాటు చేయాలని, అతి ముఖ్యంగా న్యాయవాదుల రక్షణ కోసం అసెంబ్లీ పార్లమెంట్లో న్యాయవాద రక్షణ బిల్లును ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని కోరారు. వినతి పత్రం పరిశీలించిన మంత్రి సంబంధిత శాఖవారితో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.