ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షుడిగా పెరుమాళ్ల కృష్ణమూర్తి ఏకగ్రీవ ఎన్నిక

by Sridhar Babu |
ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షుడిగా పెరుమాళ్ల కృష్ణమూర్తి ఏకగ్రీవ ఎన్నిక
X

దిశ, వైరా : వైరా ఆర్యవైశ్య కళ్యాణ మండపం నూతన అధ్యక్షుడిగా సాకేత్ కృష్ణ హాస్పిటల్ చైర్మన్, వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ల కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైరాలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశం నంబూరి మధుసూదనరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా వనమా విశ్వేశ్వరరావు, అధ్యక్షులుగా పెరుమాళ్ల కృష్ణమూర్తి,

ప్రధాన కార్యదర్శిగా నూకల శ్రీనివాసరావు (వాసు), కోశాధికారిగా మిట్టపల్లి వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా గజ్జల కృష్ణమూర్తి, మిట్టపల్లి నాగి, మిట్టపల్లి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వజినేపల్లి చక్రవర్తి, జాయింట్ సెక్రటరీగా రాయపూడి వెంకటేష్, మిట్టపల్లి సతీష్, కొమిరిశెట్టి శ్రీధర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పెరుమాళ్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే ప్రమాణస్వీకారం తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం నూతన అధ్యక్షుడు కృష్ణమూర్తికి పలువురు వైశ్య ప్రముఖులు, వైరా లయన్స్ క్లబ్, వాసవి క్లబ్, ఆర్యవైశ్య పట్టణ, మండల మహిళా సంఘాలు అభినందనలు తెలిపారు.



Next Story

Most Viewed