- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మారుతున్న జీవన విధానాల కోసం వ్యక్తిత్వ వికాసం అవసరం

దిశ, ఖమ్మం రూరల్ : ప్రస్తుతం నేటి యువత ఆలోచించే ఆలోచనలు, జీవించే విధానంలో మార్పు రావడం వల్ల యువత తప్పు దారి పడుతుందని, జీవితం పై నియంత్రణ కోసం యోగ, వ్యక్తిత్వ వికాసం చాలా అవసరమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బేలూరు మత్ తెలిపారు. స్థానిక ఖమ్మం రూరల్ మండలంలోని ప్రియదర్శిని మహిళల ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం విజయవాడ స్వామి వినశ్చలానందాజి మహారాజ్ బేలూరు మత్ ప్రతినిధి విద్యార్థినులకు స్వామి వివేకానంద జీవిత విశేషాలను తెలియజేశారు.
వివేకానందుని ఉపన్యాసాలను నేటి యువత చదవాలని కోరారు. వాటిని చదవడం వల్ల ఆత్మ బలం, బుద్ది బలం, మానసిక బలం, ఆధ్యాత్మిక బలం మెరుగుపడుతుందని తెలిపారు. కళాశాల అకాడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ మాట్లాడుతూ స్వామీజీ తత్వశాస్త్రం, అతను జీవించిన, పనిచేసిన ఆదర్శాలు భారతీయ యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని, నేటి సమాజానికి వివేకానంద స్ఫూర్తి ఎంతో అవసరమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.గోపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి సందేశాల ద్వారా వ్యక్తిగత ఎదుగుదల, దృఢమైన మనస్తత్వం పొందుతారని వివేకానంద సందేశాలను వినడం , పాటించడం వల్ల జీవితంలో పెద్ద విజయాలు సాధించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.