వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై రమేష్ కుమార్

by Sridhar Babu |
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై రమేష్ కుమార్
X

దిశ, కూసుమంచి : జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఐబీ,ఈఈ అధికారులతో కూసుమంచి మండల ఎస్సై రమేష్ కుమార్ పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ వారం నుండి కురుస్తున్న

భారీ వర్షాల పట్ల ప్రజలు అత్యవసరం అయితే తప్పా బయటకి రావొద్దని,ఇండ్ల వద్దనే ఉండి అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మండలంలోని పాలేరు నుండి నరసింహుల గూడెం, కిష్టాపురం, కొత్తూరు ఎర్ర గడ్డ వెళ్లే రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను రహదారికి అడ్డంగా పెట్టి పోలీసులు రాకపోకలను నిలిపివేశారు.



Next Story

Most Viewed