- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజలే నా బలం : ఎమ్మెల్యే రాములు నాయక్

దిశ, వైరా : ప్రజలే నా బలం బలగమని వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ అన్నారు. వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా నూతన సంవత్సర కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన కాలమంతా మనలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా ఈరోజు నుంచి నూతన ఉత్సాహంతో , ఉత్తేజంతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని, ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలె ,అక్కాచెల్లెళ్ల వలె సోదరి భావంతో మెలగాలని పేర్కొన్నారు . ఇకనుంచి పల్లె పల్లెకు వస్తానని ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి కాకుండా ఇంకా ఏమైనా అక్కడక్కడా మిగిలి ఉంటే ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపడతానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఉంచుతానని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ మరలా తనని ఆశీర్వదించినట్లయితే ఇంకా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానని వేడుకున్నారు. తరువాత శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఎనగంటి కృష్ణ ఆర్థిక సహాయంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ ,మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరు శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, వైరా మార్కెట్ చైర్మన్ బీడీ కె. రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, పోట్ల కవిత, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మొహమ్మద్ , వైరా రూరల్, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, దార్ణ రాజశేఖర్, కొనిజర్ల మండల అధ్యక్షులు వై.చిరంజీవి, జిల్లా దిశ కమిటీ సభ్యులు కట్టా కృష్ణారావు, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్రావు, పోట్ల శ్రీనివాసరావు ,ఏలూరు శ్రీనివాసరావు, మచ్చా బుజ్జి, లీల వెంకటరెడ్డి, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, వైరా పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్, కౌన్సిలర్స్ లక్ష్మీబాయి, డాక్టర్ కోటయ్య, రాష్ట్ర మిషన్ భగీరథ అధ్యక్షులు మద్దెల రవి, పట్టణ నాయకులు కర్నాటి హనుమంతరావు పాల్గొన్నారు.