పెండ్ర సతీష్ మరణం బాధాకరం : ఎమ్మెల్యే కందాళ

by Sridhar Babu |
పెండ్ర సతీష్ మరణం బాధాకరం : ఎమ్మెల్యే కందాళ
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ కి చెందిన పెండ్ర సతీష్ గురువారం తన ఇంట్లో సామాన్లు తెచ్చుకునేందుకు వెళ్తుండగా వరద తాకిడికి గల్లంతై మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శుక్రవారం పెండ్ర సతీష్ భౌతికకాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణ సహాయంగా 50 వేల రూపాయలను అందించారు. వారి కుటుంబానికి ప్రభుత్వ నుంచి సహాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణు, నాయకులు శీలం రవికుమార్, ముత్తు తదితరులు ఉన్నారు.



Next Story