మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జరిమానా

by Disha Web Desk 15 |
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జరిమానా
X

దిశ, వైరా : మద్యం తాగి ప్రమాదకరంగా వాహనం నడిపిన వ్యక్తికి మధిర ఫస్ట్ క్లాస్ జ్యూడిషన్ మెజిస్ట్రేట్ కార్తీక రెడ్డి మంగళవారం రూ. 10 వేలు జరిమానాను విధించారు. ఈ నెల 17వ తేదీ వైరా ఎస్సై మేడా ప్రసాద్ వైరాలోని రింగ్ రోడ్డు సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో కొణిజర్లకు చెందిన గుడిమల్ల శ్రీనివాస్ పరిమితికి మించి మద్యం తాగి అతి వేగంగా తన ద్విచక్రవాహనం నడుపగా ఎస్సై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. దాంతో మంగళవారం మధిర ఫస్ట్ క్లాస్ జ్యూడిషయన్ మేజిస్ట్రేట్ కార్తీక రెడ్డి శ్రీనివాస్ కు జరిమానా విధించారు. ఎస్సై మేడా ప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ నర్సింహారావును ఏసీపీ ఎం.ఏ రహమాన్, సీఐ ఎన్. సాగర్ అభినందించారు.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story