పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలు : ఎమ్మెల్యే ఉపేందర్​రెడ్డి

by Sridhar Babu |
పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలు : ఎమ్మెల్యే ఉపేందర్​రెడ్డి
X

దిశ, ఖమ్మం రూరల్​ : పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలని, అవి అభివృద్ధి పథంలో నడిస్తేనే దేశం బాగుంటుందని పాలేరు శాసనసభ సభ్యుడు కందాల ఉపేందర్​రెడ్డి అన్నారు. గురువారం రూరల్​ మండలంలోని 19 పంచాయతీలకు వివిధ కేటగిరీల్లో దక్కిన దీన్​ దయాల్​ పంచాయతీ స్వశక్తి కిరణ్​ పురస్కారాలను సర్పంచ్​లకు, పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల మాట్లాడుతూ పంచాయతీల్లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పౌర సేవలు, అభివృద్ధి, పారిశుద్ధ్యం, హరితహారం వంటి పలు రకాల పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన పంచాయతీలకు అవార్డులను ఎంపికచేసినట్లు తెలిపారు. పై కార్యక్రమాలపై సర్వే నిర్వహించిన కేంద్రం రూరల్​ మండలంలోని 19 పంచాయతీలను ఎంపిక చేసిందన్నారు.

అవార్డులు అందుకున్న పంచాయతీలు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పంచాయతీ అభివృద్ధిలో అందరిని భాగస్వాములను చేయాలని సూచించారు. రాజకీయాలకతీతంగా సేవ చేయడమే లక్ష్యంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని తెల్దారుపల్లి, పొన్నేకల్లు, తనగంపాడు, కొండాపురం, గుదిమళ్ల, కాచిరాజీగూడెం, తీర్థాల, ఏదులాపురం, గోళ్లగూడెం, చినవెంకటగిరి, తల్లంపాడు, పొలేపల్లి, మంగళగూడెం, బారుగూడెం, ఆరెకోడుతండా, గోళ్లపాడు, కస్నాతండా, ఎంవీపాలెం, పెద్దతండా పంచాయతీలకు అవార్డులను అందజేయడంతో పాటు సర్పంచ్​లు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్​ ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, ఎంపీడీవో అశోక్​కుమార్​, ఎంపీఓ శ్రీనివాసరావు, సుడా డైరెక్టర్​ గూడ సంజీవరెడ్డి, సర్పంచ్​లు, నాయకులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.



Next Story