- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గోదాం, అగ్రి అవుట్లెట్ ప్రారంభం

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండల పరిధిలోని రేజర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన 200 మెట్రిక్ టన్నుల గోదాం, అగ్రి అవుట్లెట్ ను సత్తుపల్లి శాసనసభ్యులు వెంకట వీరయ్య , ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం తో కలిసి ప్రారంభించారు. గోదాముల ఏర్పాటుతో ఎరువుల నిల్వకు సౌకర్యం ఏర్పాటుతో పాటు, అగ్రి అవుట్లెట్ల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి లాభాలు చేకూరుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు, డీసీసీబీ డైరెక్టరు చల్లగుళ్ళ క్రిష్ణయ్య, ఎంపీపీ దొడ్డ హైమవతి శంకరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుల బీమిరెడ్డి నరసింహ రెడ్డి, గండ్ర సోమి రెడ్డి, చిలుకుర్థి కృష్ణమూర్తి, మండల కార్యదర్శి భీమిరెడ్డి గోపాల్ రెడ్డి, గ్రామ నాయకులు చింతల సురేందర్ రెడ్డి, దేశిరెడ్డి సత్యనారాయణ రెడ్డి (ఎర్రబాబు), గ్రామ బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ గుర్రాల సురేషు పాల్గొన్నారు.