- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈనెల 27న భారీ బహిరంగ సభ: తుడుం దెబ్బ

దిశ, ఇల్లందు: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఇల్లెందు పట్టణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడం వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఇల్లందు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల పోరాట యోధులు అయినటువంటి సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, జంపన్న, కొమరం భీమ్, రాంజీ గుండులు పోరాటపటిమ నేడు తెలంగాణ పోరాటాన్ని బ్రతికించి వారసత్వాన్ని నిలబెడితే నేడు తెలంగాణ ఆస్తిత్వ పోరాటంతో సంబంధంలేని సేవాలాల్ని తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. వందల కోట్లు విడుదల చేసి ఆదివాసీ పోరాట వీరులను కించపరిచారని దుయ్యబట్టారు.
అదేవిధంగా చట్టబద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, ఫిఫ్త్ షెడ్యూల్ చట్టాలైనటువంటి వన్ బై సెవెంటీ, వన్ బై 59 అమలు చేయాలని, జీవో నెంబర్ మూడును యథావిథిగా అమలు చేయాలని, ఆదివాసీలకు 25 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఆదివాసీ బంధు ప్రకటించాలని తదితర డిమాండ్లతో కూడిన కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముక్తిరాజు పోదం రామ్మూర్తి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు బుర్ర స్వామి, భద్రాది జిల్లా ఉపాధ్యక్షులు మోకాళ్ళ సతీష్ కుమార్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ తాటి రామారావు, భద్రాది జిల్లా నాయకులు ముక్తి చినరాజు, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు పులసం భద్రం, ఖమ్మం జిల్లా నాయకులు ముక్తి కోటేశ్వరరావు, బుగ్గ సురేందర్, ఈసాల వెంకటేశ్వర్లు, పొడుగు హరీష్, తదితరులు పాల్గొన్నారు.