నూటికి నూరుశాతం ఫలితాలు సాధించాలి : డీఈఓ

by Sridhar Babu |
నూటికి నూరుశాతం ఫలితాలు సాధించాలి :   డీఈఓ
X

దిశ, ముదిగొండ : ముదిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈఓ సోమశేఖర శర్మ ఆకస్మికంగా సందర్శించారు. పదిలో నూటికి నూరుశాతం ఫలితాలు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన 9,10 తరగతుల విద్యార్థులను పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు వేసి సమాధానాలు అడిగారు. విద్యార్థుల స్థాయి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ప్రతి సబ్జెక్టులో అంశాల వారీగా ఎప్పటికప్పుడు పునశ్చరణ చేయాలని సూచించారు. ఈ సంవత్సరం నూటికి నూరు శాతం ఫలితాలు రాబట్టటానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకట్రామిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed