ప్రమాదకరంగా కల్వర్టు.. పట్టించుకోని అధికారులు

by samatah |
ప్రమాదకరంగా కల్వర్టు.. పట్టించుకోని అధికారులు
X

దిశ, కూసుమంచి: రహదారిలో ప్రమాదం పొంచి ఉంది రోడ్డుపై ఉన్న కల్వర్టు కుంగింది. పెద్దగుంట ఏర్పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాదిమంది ప్రయాణించే రోడ్డుపై అధికారులు కానీసం ప్రమాద సూచిక బోర్డు కూడా పెట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ వర్షాకాలంలో ప్రమాదం జరిగితే కానీ అధికారులు మొద్దు నిద్ర వీడేలా లేరు.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని చింతల తండా, పోచారం రహదారి ప్రమాదకరంగా మారింది. మార్గంలోని కల్వర్టు సగం కూలింది.అధికారులు ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదమరిచి ప్రయాణించారో ప్రమాదం భారిన పడ్డట్లే. పంచాయితిరాజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. చేగొమ్మ క్రాస్ రోడ్డు నుంచి చింతల తండా వెళ్ళే రోడ్డులో కల్వర్టు(మోరి)ను సుమారు 60 సంత్సరాల క్రితం నిర్మించారు. ఈ మార్గం లో నూతన రోడ్డు ను 03-10-2016 న పోచారం నుంచి చింతల తండా వరకు 7.70కి. మీ మేర 4.20 (కోట్ల) రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. కూలిన కల్వర్టు కింద భాగంలో ప్రమాదకరమైన సుమారు 8 అడుగుల లోతు నీటి కుంట ఉంది . ప్రమాదవశాత్తు వాహనాలు కల్వర్టు లో పడిపోతే అంతే సంగతి . ఇప్పటికైన పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పందించి సత్వరమే కల్వర్టు నిర్మాణం చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం చేయాలంటే వాహన చోదకులు భయపడుతున్నారు. ఈ వర్షాకాలంలో ఈ కల్వర్టు మిగిలిన భాగం కూడా పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది.

స్థానిక రైతుల మాటల్లో..

గ్రామానికి చెందిన రైతు ఉప సర్పంచు ధరావత్ భద్రు, దారవత్ శ్రీను‌లు మాట్లాడుతూ.. చింతల తండా పోచారం రహదారి మీదుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో నూతన హైవే పనుల కోసం అధిక బరువులతో కూడిన లారీలతో మట్టి తోలకాలు చేయడం వల్ల రహదారి కల్వర్టు సగం కూలిపోవడంతో నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయనీ సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నూతన కల్వర్టు కట్టించాలని ఆవేదన వ్యక్తంచేశారు.

దిశ విలేకరితో మాట్లాడుతూ..

కల్వర్టు కృంగిపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్లే క్రమంలో కల్వర్టు వద్ద అనేకసార్లు ప్రమాదం తప్పింది పశువుల మేకలు ఏ సమయంలోనైనా పడిపోయే ప్రమాదం ఉందనీ తెలిపారు. కల్వర్టు సగం కూలి దాదాపు సంవత్సరం కావస్తున్న పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రమాదాలు జరిగితేనే అధికారులు స్పందిస్తారా?? ఇకనైనా అధికారులు మొద్దు నిద్రను వీడి కుంగిన కల్వర్టు పై తక్షణమే స్పందించి నూతన కల్వర్టు ను ఏర్పాటు చేయాలని కోరారు.



Next Story

Most Viewed