సత్తుపల్లి మండలంలో క్షుద్ర పూజల కలకలం

by Sridhar Babu |
సత్తుపల్లి మండలంలో క్షుద్ర పూజల కలకలం
X

దిశ, సత్తుపల్లి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివుని పాలెం గ్రామ శివారులో క్షుద్ర పూజల కలకలం రేపుతోంది. అమావాస్య వచ్చిందంటే సదా శివుని పాలెం, భీమవరం, తుంబూరు, దుద్దేపూడి గ్రామాల సరిహద్దుల్లో అర్ధ రాత్రి క్షుద్ర పూజలు చేసి పూజ సామగ్రి రోడ్డు కూడలిలో వదిలి వెళ్తున్నారు. బుధవారం రాత్రి అమావాస్య కావడంతో గుర్తు తెలియని

వ్యక్తులు సదా శివుని పాలెం గ్రామ శివారులో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లతో పసుపు కుంకుమ కలిపిన అన్నం, మిరపకాయలు, కోడిగుడ్డు, నిమ్మకాయలు వదిలి వెళ్లారు. దీంతో రాత్రులు అటుగా పొలం పనులకు వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవన్నీ మూఢ నమ్మకాలు అని తెలిసినప్పటికీ అర్ధ రాత్రులు ప్రధాన రహదారుల పై ముగ్గులు వేసి ఉండటంతో కొందరు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.



Next Story

Most Viewed