సత్తుపల్లి మండలంలో క్షుద్ర పూజల కలకలం

by Mahesh |
సత్తుపల్లి మండలంలో క్షుద్ర పూజల కలకలం
X

దిశ, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివుని పాలెం గ్రామ శివారులో క్షుద్ర పూజల కలకలం రేపాయి. అమావాస్య వచ్చిందంటే సదా శివుని పాలెం, భీమవరం, తుంబూరు, దుద్దేపూడి గ్రామాల సరిహద్దుల్లో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసి పూజ సామాగ్రి రోడ్డు కూడలిలో వదిలి వెళ్తున్నారు. బుధవారం రాత్రి అమావాస్య కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు సదా శివుని పాలెం గ్రామ శివారులో ఏవో పూజలు చేసిన ఆనవాల్లతో పసుపు కుంకుమలతో కూడిన అన్నం, కోడి గుడ్లు, మిరపకాయలు, నిమ్మకాయలతో ముగ్గులు వేసి భయంకరంగా దర్శనమిస్తున్నాయి. దీంతో రాత్రులు అటుగా పొలం పనులకు వెళ్ళే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. క్షుద్ర పూజలు.. మంత్రాలు.. తంత్రాలు లేవని తెలిసిన, మూఢ నమ్మకాలు అని తెలిసినప్పటికీ అర్థ రాత్రుళ్ళు ప్రధాన రహదారుల పై ముగ్గులు వేసి ఉండటంతో కొందరు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.



Next Story

Most Viewed