- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కడుపులో బిడ్డకు న్యూట్రీషన్ కిట్.. డెలివరీ తర్వాత కేసీఆర్ కిట్ : మంత్రి పువ్వాడ

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : మహిళలు, మాతా, శిశు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో నేడు కళ్లారా చూస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ,రామవరం మాత శిశు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూట్రీషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గర్బిణిగా ఉన్నపుడు న్యూట్రీషన్ కిట్, బాలింతగా ఉన్నపుడు కేసీఆర్ కిట్ ను పంపిణీ చేయడం సీఎం కేసీఅర్ తోనే సాధ్యమైందని అన్నారు. గర్భిణులకు మంత్రి స్వయంగా న్యూట్రీషన్ కిట్లను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కిట్స్ పథకం ప్రారంభించినట్టు చెప్పారు. కొత్తగూడెం జిల్లాలో తొలి విడతలో దాదాపు 16 వేల కిట్స్ ను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం1.25 లక్షల మంది గర్భిణులు ఉన్నట్లు సమాచారం ఉండగా, దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఐరన్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల ముఖ్య లక్ష్యం అన్నారు. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ చెకప్ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వనున్నట్టు తెలిపారు. దీంతో మాతృ మరణాలు కూడా తగ్గించుకోవచ్చన్నారు.