దళిత బంధుపై మార్గదర్శకాలు రాలేదు : జెడ్పీ సీఈవో అప్పారావు

by Sridhar Babu |
దళిత బంధుపై మార్గదర్శకాలు రాలేదు :  జెడ్పీ సీఈవో అప్పారావు
X

దిశ, వైరా : రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండో విడత దళిత బంధు యూనిట్ల మంజూరు గురించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు స్పష్టం చేశారు. వైరాలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకుండా ఎంపిక ప్రక్రియ ఉండదనే విషయాన్ని గుర్తించాలన్నారు. దళిత బంధు పథకం కోసం దళారులను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేశారు.

రెండో విడత దళిత బంధు యూనిట్లు మంజూరైతే లబ్ధిదారులను ఎంపిక చేసే అర్హత వివరాలను ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. దళిత బంధు కావాలనుకునే లబ్ధిదారులు దళాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. రెండో విడత దళిత బంధు పథకం పై అపోహలను నమ్మవద్దన్నారు. వైరా నియోజకవర్గంలో దళిత బంధు మొదటి విడతలో 83 యూనిట్లను గ్రౌండ్ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కల్లూరు డీఎల్పీఓ ప్రభాకర్ రావు, వైరా ఎంపీడీవో కె. శ్రీదేవి పాల్గొన్నారు.



Next Story

Most Viewed