సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువు మృతి

by Sridhar Babu |
సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువు మృతి
X

దిశ, సత్తుపల్లి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రి లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో నవజాత శిశువు మృతి చెందింది. కాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మండలం పరిధిలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన భారతి అనే గర్భిణి నిన్న ఉదయం నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేరింది.

ఆమెను పరిశీలించిన వైద్యులు సాధారణ కాన్పు చేస్తామని చెప్పడంతో బంధువులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఉదయం వరకు అంతా బాగానే ఉందని తెలిపిన నర్సులు తీరా కాన్పు అయ్యాక శిశువు పూర్తి స్థాయిలో ఎదుగుదల చెందలేదని అందుకే చనిపోయింది అని చెప్పారు. దాంతో తమకు బిడ్డను లేకుండా చేశారని, వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed