మరమ్మతుల మాటున నయా నిర్మాణం

by Sridhar Babu |
మరమ్మతుల మాటున నయా నిర్మాణం
X

దిశ, ప్రతినిధి కొత్తగూడెం : మరమ్మతుల మాటున అనుమతి లేని బహుళ అంతస్తుల నిర్మాణానికి తెరలేపాడు ఓ పెద్దమనిషి. లక్ష్మీదేవి పల్లి మండలం మొరేడు వాగు బ్రిజ్ సమీపంలో పాడుబడిన భవంతిని నేలమట్టం చేసి ఎటువంటి అనుమతులు పొందకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారు. అధికారుల ప్రోద్బలంతో పాత భవంతిని మరమ్మతులు చేస్తున్నామంటూ ప్రజలను ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ నిర్మాణం చేపట్టిన యజమానికి రాజకీయ అండదండలు మెండుగా ఉండడంతో అధికారులు చర్యలకు వెనుకాడుతున్నట్లు పట్టణంలో ప్రచారం సాగుతుంది.

మారుమూలల్లో నిర్మాణాలు చేపట్టిన వారిపై కన్నెర్ర చేస్తున్న అధికారులకు పట్టణ నడిబొడ్డులో రోడ్డుకు ఆనుకుని నిర్మిస్తున్న ఈ భవంతి కనబడకపోవడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు పట్టణ ప్రజలు. సామాన్యులకు ఒక న్యాయం రాజకీయ పెద్దలకు మరో న్యాయమా అంటూ మండిపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అనుమతులు లేని బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed