నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ - 2022 ప్రారంభం

by Sridhar Babu |
నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ - 2022 ప్రారంభం
X

దిశ ఖమ్మం కల్చరల్ : ఖమ్మం షాదీఖానా ఫంక్షన్ హాల్లో పల్లా జాన్ రాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన స్ఫూర్తితో ప్రతి ఏటాలాగే ఈ సారి కూడా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ - 2022 ను ఘనంగా నిర్వహించారు. స్టార్ డ్రాగన్ కరాటే క్లబ్ వ్యవస్థాపకులు, కరాటి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. గాఫుర్ నేతృత్వంలో జరిగే ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది, పల్లా జాన్ రాములు కుమారుడు పల్లా రాజశేఖర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ. ఖామర్, మాజీ కార్పొరేటర్ సౌకత్ అలీ, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నల్లమోతు తిరుమల రావు , పి.అనంతలక్ష్మీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పల్లా జాన్ రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటే శరీరకదారుఢ్యాన్ని పెంచే మంచి క్రీడా అని , విద్యార్థులలో మానసిక , భౌతిక బలాన్ని అందివ్వడంతో పాటు ఆత్మస్థైర్యం , పోరాట పటిమను పెంచుతుందని అన్నారు. ఈకాలం బాల , బాలికలకు తప్పనిసరిగా కరాటే నేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. వివిధ జిల్లాల్లో నుండి వచ్చిన పాఠశాల బాల , బాలికలు తమ కరాటే విన్యాసాలు వేదిక పై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల పలు కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.



Next Story