- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దేశాభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం : ఎమ్మెల్సీ తాత మధుసూదన్

దిశ,తిరుమలాయపాలెం : కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించిన విధంగానే రాబోయే రోజుల్లో బీఅర్ఎస్ పార్టీ ద్వారా దేశం ప్రగతి సాధించడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తెలిపారు. శనివారం తాత మధుసూదన్ గ్రామమైన పిండిప్రోలు నుంచి సుమారు 20 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అనేక అభివృద్ధి పనులు చేశారని, అభివృద్ధికి మద్దతిస్తూ నేడు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లో అనేకమంది చేరుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ దేశం రాజకీయాల్లో కీలక శక్తిగా ఆవిర్భవిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ను ఆదరించినట్టే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని, ముచ్చటగా మూడోసారి విజయం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్ టి.పాలెం పీఏసీఎస్ చైర్మన్ చావ వేణుగోపాల్ కృష్ణ, వైస్ చైర్మన్ చామకూరి రాజు, నాయకులు పోలెపొంగు వెంకటేశ్వర్లు, పరికపల్లి చంద్రశేఖర్, దూదిమెట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.