- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీజేపీ ఆధ్వర్యంలో నా మట్టి.. నా దేశం

దిశ, భద్రాచలం : భారతీయ జనతా పార్టీ భద్రాచలం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర. రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు నా మట్టి... నా దేశం కార్యక్రమంలో భాగంగా మట్టి దీపంతో సామూహిక ప్రతిజ్ఞ నిర్వహించారు. స్థానిక సిద్ధార్థ స్కూల్ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేయించారు.
మిట్టికో సమాన్ వీ రొంకా వందన్... మట్టికి నివాళులు, వీరులకు వందనం అనే ఆజాద్ కా అమృత ఉత్సవంలో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నిడదవోలు నాగబాబు, మండల అధ్యక్షులు ములిసెట్టి రామ్మోహన్ రావు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బోడ సత్యనారాయణ, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మొక్కెర కోటేశ్వరి, నియోజకవర్గ ఫుల్ టైమర్ నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి త్రిబుల్ ఎక్స్ చక్రవర్తి, మండల ఉపాధ్యక్షులు సూరత్ సుదర్శన్ పాల్గొన్నారు.