- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి : లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 91వ అమరత్వ దినాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా పాటిస్తూ ఏరియా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, సామ్రాజ్యవాద తొత్తులైన మోడీ, అమిత్ షా దిష్టిబొమ్మలను తగలబెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరిట ఓ లేఖను విడుదల చేశారు. ఈ సంవత్సరం ఉక్రెయిన్ దేశంపై యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అనేక రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
దేశంలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన నాటి నుండి బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతూ సామ్రాజ్యవాద దోపిడీ విధానాలకు మరింత దూకుడుగా అమలు చేస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలో నెట్టివేస్తూ కూటికి దొరకని కటిక దారిద్రంలోకి ప్రజలను నెట్టివేస్తున్నాయని విమర్శించారు. పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు ఊతమిచ్చే సంస్కరణలు చట్టాలను అమలు చేస్తూ నిత్యం ప్రజల రక్తాన్ని పిండి అంబానీ, అదాని, టాటా, బిర్లా లాంటి పెట్టుబడిదారులకు ధారపోస్తుందని విమర్శించారు.
రైతాంగ భూములను హరితహారం, ప్రాజెక్టుల పేరుతో సాగుభూములను కబ్జా చేసి రైతాంగానికి ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఫారెస్ట్ అధికారులను రైతులపైకి ఉసిగొల్పుతూ, రాజ్యాంగంలోని చట్టాలను మార్చి అడవిలోని సంపదను, ఖనిజాలను, ప్రకృతి సంపదను సామ్రాజ్యవాదులకు అప్పగించడానికి విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఖనిజాలను తవ్వి వేల ఎకరాలను బొందల గడ్డగా మార్చివేస్తున్నారని, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ దేశంలో ఇప్పటికీ ఆర్థిక వలస భూస్వామ్య పాలనే నడుస్తుందని, సామ్రాజ్యవాద తొత్తులైన మోడీ, అమిత్ షా ల దిష్టిబొమ్మను తగలబెట్టాలని లేఖలో పిలుపునిచ్చారు.