- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పొంగులేటిపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు

దిశ, ఇల్లందు: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, టీజీబీకేఎస్ నాయకుడు చేసిన ఆరోపణలను పలువురు ఎంపీటీసీలు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఇల్లందులోని జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయం నందు వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కోరం కనకయ్య ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజక అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారన్నారు. 2014 ఎన్నికల సమయానికి నియోజకవర్గంలో అట్టడుగున ఉన్న బీఆర్ఎస్ ఓటు బ్యాంకును 2018 ఎన్నికల నాటికి 60వేల పైచిలుకు బలమైన ఓటు బ్యాంకుగా మలిచిన ఘనత కోరం కనకయ్య కే దక్కిందన్నారు. జెడ్పీ నిధులతో జిల్లాలోని వివిధ మారుమూల ప్రాంతాలతో పాటుగా ఇల్లందు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండటంతో ఓ పక్క నియోజకవర్గ ప్రజలు కనకయ్యకి బ్రమ్మరథం పడుతుండటం, మరోపక్క ఉమ్మడి జిల్లాతోపాటుగా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన అనేక బీద, బాధిత కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాలతోపాటుగా, కుల మతాలకతీతంగా చర్చీ, దేవాలయాలు, ఈద్గా లాంటి ప్రార్థనా మందిరాల నిర్మాణాలకు సహాయ సహకారాలు, ఆడబిడ్డల కళ్యాణానికి నూతన వస్త్రాలు అందిస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న అనేక బీద,బిక్కి కుటుంబాలకు తమ వైద్యశాల నందు ఉచిత చికిత్స నిర్వహిస్తుండటంతో, నియోజకవర్గం నలుమూలల నుంచి పొంగులేటి, కోరం లకు ఘన స్వాగతాలు పలుకుతుండటంతో ఇక చేసేదేమీ లేక రాబోవు రోజుల్లో వీరి రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసమే అర్థరహిత ఆరోపణలను చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మండల రాము, పాయం కృష్ణ ప్రసాద్, పూనెం సురేందర్, మాజీ రైతు సమితి అధ్యక్షులు సువర్ణపాక సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాటి బిక్షం,మాజీ ఆత్మ కమిటీ ఛైర్మెన్ మూతి కృష్ణ, ఇందిరా నగర్ ఉప సర్పంచ్ ఎల్లయ్య, నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, గుగ్లోత్ నాగార్జున,ఎల్లయ్య,బండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.