- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
స్టేషన్ పనులు పూర్తయ్యేదెన్నడో.. పనుల జాప్యం పై ఎంపీ ఆగ్రహం

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయడంలో జరుగుతున్న ఆలస్యం పై ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనుకున్న సమయంలో పనులు జరగకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, గుత్తేదారుకు ఫోన్ చేసి పనులు ఎంత వరకు పూర్తయ్యాయని, ఎందుకు పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రశ్నించిన ఎంపి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న పనుల పరిశీలించిన ఎంపీ రఘు రాంరెడ్డి వీలైనంత త్వరలోనే పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎంపి వెంట మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ళ మురళి, ఊకంటి గోపాల్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.