కందుకూరు గ్రామ అభివృద్ధికి ఎంపీ నిధులు

by Sridhar Babu |
కందుకూరు గ్రామ అభివృద్ధికి  ఎంపీ  నిధులు
X

దిశ, వేంసూర్ : రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి తన సొంత గ్రామమైన ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కందుకూరు గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణాలకు తన ఎంపీ నిధుల నుండి 60 లక్షల రూపాయలు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన మంజూరు పత్రాన్ని స్థానిక సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో అందచేశారు. గ్రామంలో అభివృద్ధి పనులకు, సీసీ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 60 లక్షల ఎంపీ నిధులతో కందుకూరు గ్రామంలో సీసీ రోడ్లు వేయనున్నట్టు చెప్పారు.



Next Story

Most Viewed