మహాశివరాత్రికి ముస్తాబైన 'మోతేగడ్డ'

by samatah |
మహాశివరాత్రికి ముస్తాబైన మోతేగడ్డ
X

దిశ,బూర్గంపాడు : బూర్గంపాడు మండలంలోని మోతే పట్టినగర్ గ్రామంలో పవిత్ర గోదావరి నదితీరాన మోతెగడ్డ శ్రీభద్రకాళి సమేత వీరభద్రుని ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. ఈనెల 18న మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి తిరుకల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.మోతెగడ్డ శివాలయంగా పేరున్ను ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో శివభక్తులైన కాకతీయ ప్రభువులు సుమారు 800 ఏళ్ల క్రితమే నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

వీరభద్రుడు గోదావరి నది మధ్యలో వెలిసినట్లుగా పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.శివుని మామ దక్షుడు యజ్ఞాన్ని ప్రారంభించి ఆ యజ్ఞానికి ప్రమాదగణాల్లో ప్రథముడైన శివుడిని ఆహ్వానించకుండా నిరీశ్వర యజ్ఞాన్ని నిర్వహించడం వల్ల యజ్ఞానికి పిలవకపోయినా దక్షుని కుమార్తె పార్వతి వెళ్లి శివుడిని ఆహ్వానించకపోవడంపై తండ్రిని నిలదీసిందని, మహామహులు,మహర్షులు, విష్ణు,బ్రహ్మ యజ్ఞవాటికలో ఆసీనులై ఉన్న సమయంలో శివునిపై ఉన్న అక్కసుతో దక్షుడు పార్వతిని నానా విధాలుగా అవమానకరంగా మాట్లాడి యజ్ఞవాటికి నుంచి వెళ్లిపొమ్మంటారు.మహాశివుడిని అవమానించినందుకు బాధపడిన పార్వతి కాలిబొటన వేలితో బలంగా భూమిని తాకి అగ్నిని రగుల్కొలిపి అందులో ఆహుతవుతుంది.ఈ విషయం తెలుసుకున్న శివుడు పార్వతి బస్మంగా మారినందుకు ఉగ్రుడై తన జటాజూటం నుంచి ఒక జంటను లాగి భూమిపై విసరగా దాని నుంచి వీరభద్రుడు ఉద్భవించే శివుని ఆజ్ఞ ప్రకారం దక్షవాటికను సందర్శించి రక్షుడితో సహా అందరినీ సంహరిస్తారు. అనంతరం కోపంతో గంగా స్వరూపమైన పవిత్ర గోదావరి' నదికి పేదతీరేందుకు వచ్చి నదీమాద్యమంలో ఉన్న గుట్టపై వీరభద్రునిగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

భద్రాద్రి పరిసర ప్రాంతాల్లో అపుడు వీరభద్రుని రూపంలో వెలిసి ఉండగా జగారాలకు అయిన పార్వతీమాత భద్రకాళిగా ఈ ప్రాంత గిరిజనులకు ఆడబిడ్డగా జన్మించింది.మోతగడ్డపై వెలసిన వీరభద్రస్వామిని ఆరాధించేదని పెద్దలు చెబుతుంటారు.ఒక్కడుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న వీరభద్రస్వామివారిని భద్రకాళిగా ఉన్న పార్వతి వరించి మహాశివరాత్రి పర్వదినాన వివాహం చేసుకుంది.నాటి నుంచి స్వామివారి వివాహన్ని శివరాత్రి పర్వదినం రోజు తెల్లవారుజామున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ వివాహాన్ని పూర్తిగా గిరిజన సాంప్రదాయంలోనే నిర్వహిస్తారు. ఈ వివాహాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలు భక్తులతో పాటు చత్తీష్ ఘడ్,ఒడిస్సా, మధ్యప్రదేశ్,మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. ఆలయానికి మోతె పుష్కరఘాట్ వరకు భక్తులు వాహనాల్లో చేరుకోవచ్చు.ఇక్కడి నుంచి గోదావరి నదిలో పడవపై ప్రయాణించి లేదా గోదావరిలో నీటిని బట్టి నడిచి గోదావరి నది మధ్య తీరంలో ఉన్న శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి చేరుకోవచ్చు.

మోతే ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు..

గోదావరి నదీతీరాన కొలువైన వీరభద్రుని ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.తొలిరోజు మాఘ బహుళ ద్వాదశిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 3 గంటలకు చింతలగూడెం నుంచి శ్రీవీరభద్రస్వామి వారిని గుట్టకు చేర్చి స్వామివారికి అభిషేకం, మంగళహారతి,మంత్రపుష్పం, నివేదన,తీర్థప్రసాద వినియోగం నిర్వహిస్తారు.18న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి వారికి తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతం,5 గంటలకు మహన్యాసపూర్వక అలంకరణ, విశేషఆద్యన,ఉదయం 7గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి మహారుద్రాభిషేకం,మహాబిల్వార్చన,రాత్రి 10.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి వార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని కళ్యాణమండపంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

19వ ఉదయం 7 గంటల నుంచి అబిషేకాలు,పూజలు, మహానివేదన,సాయంత్రం 5గంటల నుంచి స్వామివారిని తీసుకుని వెళ్లడం,మోతె గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తారు. 20న మోతే నుంచి స్వామివారిని గుట్టకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా చింతలగూడెం గ్రామానికి తీసుకువెళతారు. 21న చింతలగూడెంలో స్వామివారి ఊరేగింపు అనంతరం గుట్టకు తీసుకువచ్చును.ప్రత్యేక పూజల అనంతరం సీతంపేటకు ఊరేగింపుగా తీసుకువెళతారు. 22వ ఉదయం 6గంటలకు సీతంపేట నుంచి స్వామివారు గుట్టకు చేరడం,అనంతరం అభిషేకాలు,పూజలు,నాగవెల్లి కార్యక్రమాలు నిర్వహించి నివేదన అనంతరం స్వామివారిని చింతలగూడెంలో పూజారి ఇంటి వద్ద ప్రత్యేక మందిరానికి చేర్చడంతో శివరాత్రి మహోత్సవాలు ముగుస్తాయి.

ఆలయంలో జాతరకు ఏర్పాట్లు పూర్తి మోతేగడ్డ వీరభద్రుని ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా జరిగి జాతర మహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జు సందర్శన్,గ్రామ పెద్ద,సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.పావన గోదావరి నది తీరంలో ఆలయం కొలువై ఉండటంతో గోదావరిలో ఆవతలి ఒడ్డున ఉన్న ఆలయంలోని వీరభద్రుడిని దర్శించుకునేందుకు భక్తులు బూర్గంపాడు మండలం నుంచే కాకుండా సమీప మండలాలు, గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. గోదావరి వద్ద పడవలను సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.ఇప్పటికి పోలీసు,రెవెన్యూ,దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను సైతం పర్యవేక్షించారు.



Next Story